తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'చిన్నారిని చిదిమేసిన ఉన్మాదిని ఉరి తీయాలి'

చిన్నపిల్లలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న క్రూరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ... హైదరాబాద్​ మైత్రివనంలో టీవీ ఆర్టిస్ట్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

By

Published : Jun 23, 2019, 8:04 PM IST

WOMEN PROTESTING AGAINST WARANGAL CHILD RAPE AT HYDERABAD MYTRIVANAM

వరంగల్​లో చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్​లోని మైత్రివనం వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితున్ని వెంటనే ఉరితీయాలని డిమాండ్​ చేశారు. చిన్నపిల్లలు, ఆడవాళ్లపై ఆత్యాచారాలకు పాల్పడే క్రూరులను ఆలస్యం చేయకుండా కఠినంగా శిక్షించాలని మహిళలు కోరారు. నిరసనతో మైత్రివనం వద్ద రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు బుజ్జగించినా వినకపోవటం వల్ల అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్​స్టేషన్​కు తరలించారు.

టీవీ ఆర్టిస్ట్​ ఆద్వర్యంలో ఆందోళన

ABOUT THE AUTHOR

...view details