తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'సాహో' దర్శకుడి భావోద్వేగం.. ప్రభాస్​పై కామెంట్

'సాహో' దర్శకుడు సుజీత్.. హీరో ప్రభాస్, నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ సందేశాన్ని పంచుకున్నాడు.

By

Published : Aug 29, 2019, 3:07 PM IST

Updated : Sep 28, 2019, 5:52 PM IST

సినిమా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'సాహో'. యువ దర్శకుడు సుజీత్ రూపొందించాడు. ఈ సినిమాను ఎంతో కష్టపడి తెరకెక్కించామని అంటూ హీరో ప్రభాస్​, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాడీ డైరక్టర్. ఇన్​స్టాగ్రామ్​లో భావోద్వేగభరిత సందేశాన్ని పంచుకున్నాడు.

సుజీత్ సందేశం

"నాకు ఏమీ లేనప్పుడు నాతో ఉండి, వీడు ఏదో సాధిస్తాడు అనుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. షార్ట్ ఫిల్మ్స్ లేకుంటే నేను లేను, అది నిజం. నువ్వు నిన్ను నమ్మితే, నిన్ను ఎంత మంది ఆపాలి అనుకున్నా ఆపలేరు. నన్ను నాకన్నా ఎక్కువ నమ్మిన నా హీరో(ప్రభాస్), నిర్మాతల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాను థియేటర్లలో చూడండి. పైరసీని ప్రోత్సహించవద్దు". -సుజీత్, 'సాహో' దర్శకుడు

'రన్ రాజా రన్'తో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుజీత్. 'సాహో' అతడికి రెండో సినిమా. ఇందులో అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, మందిరా బేడీ, మహేశ్​ మంజ్రేకర్ వంటి భారీతారగణం నటించింది. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు.

ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్

Last Updated : Sep 28, 2019, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details