తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రూ.5వేల శివలింగానికి రూ.10లక్షలు

మోదీకి గత ఐదేళ్లలో వచ్చిన జ్ఞాపికలను, మెమెంటోలను వేలం వేశారు. 1,800 వస్తువుల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకు ఇవ్వనున్నారు.

By

Published : Feb 10, 2019, 6:53 PM IST

మోదీ మెమొంటోల వేలం

ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికల వేలం పాట ముగిసింది. రూ.వేలల్లోని జ్ఞాపికలు రూ.లక్షలు పలికాయి. రెండు వారాల పాటు సాగిన వేలంలో ఎంత డబ్బు వచ్చిందో ప్రధాని కార్యాలయం వెల్లడించలేదు.

ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వం గంగానది ప్రక్షాళకోసం ఉద్దేశించిన 'నమామి గంగే' ప్రాజెక్టుకు ఖర్చుచేయనున్నారు.

1,800 జ్ఞాపికలు వేలంపాటలో ప్రజలు కొనగోలు చేసినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. రూ.5 వేల విలువ చేసే శివుని విగ్రహం 10లక్షలు పలికింది. అంటే అసలు ధరకు 200 శాతం అధికం.

మోదీ మెమొంటోల వేలం

చెక్కతో చేసిన అశోక స్తంభం జ్ఞాపిక... అసలు ధర 4 వేలు కాగా...13 లక్షలకు విక్రయించారు.

ప్రధాని అసోం పర్యటన సందర్భంగా అక్కడి సభలో ఇచ్చిన సంప్రదాయ ట్రే హొరాయి వేలంపాటలో భారీ లాభాన్నే అర్జించింది. జ్ఞాపిక అసలు ధర

2 వేలు కాగా... 12లక్షలకు అమ్ముడుపోయింది.

రూ. 4 వేలు విలువ చేసే గౌతమ బుద్ధుని విగ్రహం రూ.7లక్షలు పలికింది.

మోదీ మెమొంటోల వేలం

నేపాల్​ మాజీ ప్రధాని సుశీల్ కోయిరాల మోదీకి ఇచ్చిన ఇత్తడి సింహం విగ్రహం రూ.5.20లక్షలకు అమ్ముడైంది.

ప్రధానిగా మోదీ ప్రజాప్రయోజనం కోసం జ్ఞాపికలను వేలంపాట వేయడం మొదటి సారి. గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే చేసేవారు. అలా వచ్చిన డబ్బును బాలికల చదువుకోసం కేటాయించేవారు.

ABOUT THE AUTHOR

...view details