తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2019, 8:41 PM IST

ETV Bharat / briefs

విలీన ప్రక్రియ వారి వెర్రికి పరాకాష్ట: రేవంత్​రెడ్డి

సీఎల్పీ విలీనంపై ఎంపీ రేవంత్​రెడ్డి ఘాటుగా స్పందించారు. స్పీకర్​ తన పరిధిదాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక చర్యలపై న్యాయస్థానంతో పాటు ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టం చేశారు.

కేసీఆర్​పై రేవంత్​ ఆగ్రహం

ముఖ్యమంత్రిపై ఎంపీ రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను బెదిరించి, ఒత్తిడికి గురిచేసి తెరాసలో చేర్చుకున్నారని ఆరోపించారు. స్పీకర్​ తనకు లేని అధికారాలను ఆపాదించుకొని, విలీన ప్రక్రియ చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి మాత్రమే పార్టీలను విలీనం చేయగలరని తెలిపారు. గతంలో తెదేపా ఎమ్మెల్యేలను ఇలానే తెరాసలో కలిపేందుకు ప్రయత్నిస్తే న్యాయస్థానం ద్వారా తాను నిలువరించానని తెలిపారు.

కేసీఆర్​పై రేవంత్​ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details