తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఉపఎన్నికల్లో పోటీకి తలైవా దూరం

తమిళ తలైవా రజనీకాంత్ ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని ప్రకటించారు.

By

Published : Mar 10, 2019, 5:59 PM IST

ఉపఎన్నికల్లో పోటీకి తలైవా దూరం


తమిళనాడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు తలైవా రజనీకాంత్. 2017 డిసెంబర్​ 31న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన ఆయన ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు చేయలేదు. ఉపఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వనున్నారో తెలపలేదు రజనీకాంత్. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమని ఇటీవలే వెల్లడించారు రజనీ. తమిళనాడు నీటి సమస్యను తీర్చే పార్టీకే తన మద్దతుంటుందని ఇటీవల ఓ ప్రకటన చేశారు.

తమిళనాడులోని అతిపెద్ద సమస్య నీటి ఎద్దడేనని పేర్కొన్నారు రజనీ. గతంలోనూ నదుల అనుసంధానాన్ని సమర్థిస్తానని పేర్కొన్నారాయన. రాజకీయ ప్రచారానికి తన చిత్రాల్ని, తన అభిమాన సంఘం 'రజనీ మక్కల్​ మండ్రం' పతాకాన్ని వాడొద్దని పిలుపునిచ్చారు రజనీ కాంత్.

ఇదీ చూడండి:భారత్​... పాక్​... ఓ ప్రేమ వివాహం

ABOUT THE AUTHOR

...view details