తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాహుల్​ గాంధీకి 'రఫేల్​ ఫోబియా': రవిశంకర్​ ప్రసాద్​

రఫేల్​ ఒప్పందంపై రాహుల్​ చేస్తోన్న విమర్శలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్​ తీవ్రంగా స్పందించారు. నెహ్రూ, పటేల్​, రాజాజీ, కామరాజ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి రాహుల్​ అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడతారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

By

Published : Feb 10, 2019, 9:04 PM IST

రాహుల్​కు రఫేల్ ఫోబియా అన్న రవిశంకర్

రాహుల్​కు రఫేల్ ఫోబియా అన్న రవిశంకర్
రఫేల్​ ఒప్పందంపై రాహుల్​ చేస్తోన్న విమర్శలపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్​ తీవ్రంగా స్పందించారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. రాహుల్​ గాంధీ రఫేల్​పై అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

"రాహుల్​ గాంధీకి రఫేల్​ఫోబియా పట్టింది. ప్రధానికి వ్యతిరేకంగా రాహుల్​ వాడుతోన్న భాష ఆక్షేపనీయం. తన తండ్రిపై బోఫోర్స్​కు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి? ఇందిరాజీ అవినీతి రికార్డు సంగతేంటి? కానీ మేము రాహుల్​ గాంధీలా అప్రజాస్వామిక భాషను ఉపయోగించట్లేదు. అబద్ధాలను బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. నెహ్రూ, పటేల్​, రాజాజీ, కామరాజ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి రాహుల్​ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి హోదాలో ఉండి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడతారా..? రఫేల్​ విమానాలు యూపీయే హయాంలో కొనుగోలు చేసినదానికన్నా 9శాతం చౌకగానే కొన్నాం."

-రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర న్యాయశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details