తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"సమయం, స్థలంపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ"

పుల్వామా ఘటన అనంతరం యావత్ దేశం ఆగ్రహంగా ఉందని, 130 కోట్ల మంది ప్రజలు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్​ను హెచ్చరించారు.

By

Published : Feb 15, 2019, 5:38 PM IST

"సమయం, స్థలంపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ"

ఉగ్రదాడికి ప్రతి చర్యల కోసం సమయం, స్థలంపై నిర్ణయాలు తీసుకునే విషయంలో భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పుల్వామా ఘటనను ప్రస్తావించారు ప్రధాని.

అక్కసుతోనే పొరుగుదేశం దాడికి తెగబడినట్లు పాకిస్థాన్​ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ఆ దేశం నిరాశలో కూరుకుపోయి భారత్​పై ఉగ్ర దాడి చేసిందని మండిపడ్డారు. రోజువారీ ఖర్చుల కోసం యాచక పాత్రతో ప్రతి దేశానికి వెళ్తారని పాక్​ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇలాంటి దాడులతో భారత ప్రగతిని ఆపాలని దాయాది దేశం అనుకుంటోందని, కానీ భారత్​ తాను ఎంచుకున్న మార్గంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మోదీ స్పష్టం చేశారు.

పలు రాజకీయ కార్యక్రమాల్లో మోదీ పాల్గొనాల్సి ఉండగా పుల్వామా దాడి కారణంగా వాటిని వాయిదా వేశారు. బుందేల్​ఖండ్​ లో రక్షణ నడవాకు శంకుస్థాపన చేశారు మోదీ.

ABOUT THE AUTHOR

...view details