తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆధార్​ అ​నుసంధానం చేసుకోకపోతే పాన్​ రద్దు..!

42 కోట్ల పాన్​ కార్డులకు గాను 23కోట్ల కార్డులకే ఇప్పటివరకు ఆధార్​ అనుసంధానం అయింది. అనుసంధానానికి తుది గడువు మార్చి 31.

By

Published : Feb 8, 2019, 6:27 AM IST

Updated : Feb 8, 2019, 6:36 AM IST

పాన్​కార్డు, ఆధార్​ కార్డు

ఆధార్​తో పాన్​ అనుసంధానం తప్పనిసరి
ఆధార్​ నంబరుతో అనుసంధానం కాని పాన్​కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి(సీబీడీటీ) చైర్మన్​ సుశీల్​ చంద్ర. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 42 కోట్ల పాన్​కార్డులను జారీ చేసిందని, ఇప్పటి వరకు 23కోట్ల కార్డులు మాత్రమే ఆధార్​తో అనుసంధానం అయినట్టు వెల్లడించారు.

మార్చి 31 తుది గడువు

ఆధార్​ అనుసంధానానికి తుది గడువు ముంచుకొస్తోంది. మార్చి 31తో ముగుస్తుంది. అయినా ఇప్పటి వరకు దాదాపు 19కోట్ల మంది పాన్​కు ఆధార్​ అనుసంధానించుకోలేదు.

ఆధార్​ అనుసంధానం చేయడం వల్ల నకిలీ పాన్​ కార్డులను సులువుగా గుర్తించవచ్చన్నారు సుశీల్​ చంద్ర. ఎవరైనా ఆధార్​తో అనుసంధానం చేయించుకోకపోతే ఆ కార్డులు మార్చి 31 తర్వాత రద్దు కావొచ్చని చెప్పారు.

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్​ను తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. అదేవిధంగా పాన్​కార్డుకు ఆధార్​ అనుసంధానానికి మార్చి 31 వరకు గడువిచ్చింది.

ఆధార్​కార్డుకు రాజ్యాంగబద్ధత ఉందని సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్​లో తీర్పునిచ్చింది.

" ఒక్కసారి ఆధార్​తో పాన్​కార్డు అనుసంధానం అయితే, బ్యాంకు ఖాతాలకు లింక్​ అవుతుంది. అప్పుడు లావాదేవీలు, ఆస్తుల వివరాలు అన్నీ ఆదాయపు పన్ను శాఖకు తెలుస్తాయి. అలాగే అర్హులకు ప్రభుత్వ ఫలాలను, పథకాలను అందించడానికి సులువవుతుంది"

-- సుశీల్​ చంద్ర, సీబీడీటీ ఛైర్మన్​

Last Updated : Feb 8, 2019, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details