తెలంగాణ

telangana

ETV Bharat / briefs

భాజపా గెలిస్తే భారత్​తో సఖ్యత: పాక్​ ప్రధాని

భారత ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్. భాజపా గెలిచి మళ్లీ అధికారాన్ని చేపడితే భారత్​తో సఖ్యత కుదిరే అవకాశం ఉందన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. పాక్​తో మోదీకున్న మైత్రి అధికారికంగా బయటపడిందని ఆరోపించింది.

By

Published : Apr 10, 2019, 1:16 PM IST

Updated : Apr 10, 2019, 2:02 PM IST

భాజపా గెలిస్తే భారత్​తో సఖ్యత: పాక్​ ప్రధాని

భారత్​లో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్​కు ఒక్కరోజు ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా మళ్లీ గెలిస్తే కశ్మీర్ అంశంలో పురోగతి సహా భారత్​తో శాంతి నెలకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విదేశీ పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్​.

వేరే పార్టీలు గెలిస్తే మతతత్వ వాదులకు భయపడి, కశ్మీర్ అంశంపై వెనక్కి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య కశ్మీర్ అంశమే కీలకమని అభిప్రాయపడ్డారు ఇమ్రాన్.

పుల్వామా ఉగ్రదాడిలో 40మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఘటనకు కారణమైన జైషే ఉగ్రక్యాంపులపై భారత వాయుసేన వైమానిక దాడులు చేసి బదులుతీర్చుకుంది.

మోదీకి ఓటేస్తే పాక్​ను గెలిపించినట్టే...

సుర్జేవాలా ట్వీట్

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది. ఇమ్రాన్​ వ్యాఖ్యలు పాక్​తో భాజపా మైత్రిని అధికారికంగా ధ్రువీకరిస్తున్నాయని ఆరోపించింది. మోదీకి ఓటేస్తే పాకిస్థాన్​ను గెలిపించినట్లేనని ట్వీట్​ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. మోదీ మొదటగా పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​తో మైత్రి చేశారని, ఇమ్రాన్ ప్రస్తుతం మోదీకి అత్యంత సమీప స్నేహితులని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Last Updated : Apr 10, 2019, 2:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details