తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేను గెలిస్తే నాగర్​కర్నూల్​కు రైల్వేలైన్​: మల్లురవి

లోక్​సభ ఎన్నికల్లో తాను గెలిస్తే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న నాగర్​కర్నూల్ రైల్వేలైన్​ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఎంపీ అభ్యర్థి మల్లురవి.

By

Published : Mar 21, 2019, 6:19 AM IST

Updated : Mar 21, 2019, 8:48 AM IST

మల్లు రవి

నాగర్​కర్నూల్​ లోక్​సభ అభ్యర్థిగా మాజీ మంత్రి రాములును తెరాస బరిలో నిలుపుతోందని.. గతంలో మంత్రిగా పనిచేసి ఆయన ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమి లేదని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. ఎంపీగా తనను గెలిపిస్తే ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న రైల్వే లైను ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ.. తన గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగం జనార్దన్​రెడ్డి, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

నాగర్​కర్నూల్​ లోక్​సభ అభ్యర్థి మల్లు రవి
Last Updated : Mar 21, 2019, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details