తెలంగాణ

telangana

పంజాబ్ కుర్రాళ్లు నా కోసం కప్పు గెలుస్తారు : గేల్

By

Published : Mar 26, 2019, 4:40 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ టైటిల్​ను తమ జట్టే కైవసం చేసుకుంటుందని కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​ బ్యాట్స్​మెన్​​ క్రిస్ గేల్ ధీమా వ్యక్తం చేశాడు. తన కోసం జట్టులోని కుర్రాళ్లు కప్పు గెలుస్తారని చెప్పాడు.

ఈ ఏడాది ఐపీఎల్​లో పంజాబ్ జట్టు కప్పు గెలుస్తుందన్న క్రిస్ గేల్

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) టైటిల్​ను తమ జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​ బ్యాట్స్​మెన్​ క్రిస్​ గేల్​.

మొదటి మ్యాచ్​లో మేం గెలవకపోయిన పెద్ద ఇబ్బంది లేదు. కానీ విజయం సాధించాం. ఇంగ్లండ్ సిరీస్​ నుంచి నేను మంచి ఫామ్​లో ఉన్నా. ఐపీఎల్​ను అదే రీతిలో ప్రారంభించాలనుకున్నాను. ఇది శుభపరిణామం. జట్టు కుర్రాళ్లు రోజు రోజుకూ మెరుగవుతున్నారు. నా కోసం ఈ సీజన్​లో కప్పు సాధిస్తారు - క్రిస్ గేల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్

సోమవారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​పై పంజాబ్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. 79 పరుగులు చేసిన గేల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'​గా నిలిచాడు.

2019 ప్రపంచకప్​ తర్వాత అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడీ కరీబియన్ క్రికెటర్.

ABOUT THE AUTHOR

...view details