తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మరోసారి మోదీ ప్రధాని కావాలంటూ.. సైకిల్ యాత్ర

కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రావాలని కోరుతూ.. జగిత్యాల జిల్లాకు చెందిన రవీంద్ర కుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని 17 లోక్​సభ నియోజకవర్గాల్లో సైకిల్​పై పర్యటించి కమలం పార్టీకి మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నాడు.

By

Published : Mar 21, 2019, 6:12 AM IST

Updated : Mar 21, 2019, 9:20 AM IST

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర
మరోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీయే కావాలంటూ ఓ భాజపా కార్యకర్త చేపట్టిన సైకిల్ యాత్ర మహబూబ్​నగర్​కు చేరుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సైకిల్​పై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన రవీంద్ర కుమార్. మహాశివరాత్రి రోజు ధర్మపురి క్షేత్రంలో ఈ యాత్రను ప్రారంభించినట్లు రవీంద్ర కుమార్ తెలిపారు.

తెలంగాణలో భాజపా ఎక్కువ శాతం పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కమలం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో పర్యటించి ప్రచారం చేస్తానని రవీంద్ర కుమార్ తెలిపారు.

Last Updated : Mar 21, 2019, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details