తెలంగాణ

telangana

'మహిళల అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపించాలి'

తెలంగాణ రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రతినిధులు గళమెత్తారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు.

By

Published : Jun 13, 2019, 9:31 PM IST

Published : Jun 13, 2019, 9:31 PM IST

'మహిళల అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపించాలి'

తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది మంది మహిళల అదృశ్యం అవుతున్నారని భాజపా మహిళా మోర్చా ప్రతినిధులు ఆరోపించారు. అదృశ్యమైన వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. మహిళల అదృశ్యంపై వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్​కు వెళ్తే పోలీసులు అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో మహిళా కమిషన్​తో పాటు మానవ హక్కుల కమిషన్​కు ఛైర్మన్​ను నియమించాలని కోరారు.

'మహిళల అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపించాలి'
ఇదీ చూడండి: 'అదృశ్య వివరాలపై పోలీసు శాఖ స్పందించాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details