తెలంగాణ

telangana

By

Published : May 3, 2023, 4:02 PM IST

Updated : May 3, 2023, 5:06 PM IST

ETV Bharat / bharat

ఫేమస్ యూట్యూబర్ మృతి.. వీడియో కోసం గంటకు 300కి.మీ స్పీడ్​తో బైక్ రైడ్ చేస్తూ..

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన బైక్​ ప్రమాదంలో ఓ యూట్యూబర్ మరణించాడు. బైక్​పై అతివేగంగా వెళుతూ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. య్యూటూబ్​లో అతనికి లక్షల్లో సబ్​స్క్రైబర్​లు.. కోట్లలో వీక్షకులు ఉన్నారు. మరోవైపు కారుతో యువకుడ్ని ఢీ కొట్టి.. 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన ఓ బాలుడు. అనంతరం స్తంభాన్ని ఢీ కొట్టాడు. ఛత్తీస్​గఢ్​లో జరిగిందీ ఘటన.

youtuber-died-in-bike-accident-youtuber-agastya-chauhan-died-in-accident
బైక్​ ప్రమాదంలో యూట్యూబర్ మృతి

యూట్యూబ్​ వీడియో కోసం ఓ ప్రముఖ యూట్యూబర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వీక్షకులను ఆకట్టుకునేందుకు.. రేసింగ్​ బైక్​పై గంటకు 300 కి.మీ వేగంతో వెళుతూ డివైడర్​ను ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యూట్యూబ్​లో బైక్​ నడుపుతూ ప్రొఫెషనల్ వీడియోలు చేసే ఆ యూట్యూబర్.. అదే టూవీలర్​ ప్రమాదంలో మృతి చెందాడు. దిల్లీలో జరిగే టూవీలర్​​ లాంగ్ రైడ్ పోటీల్లో పాల్గొనేందుకు బైక్​పై వెళ్లిన అతడు.. ఇలా ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో మృతి చెందిన యూట్యూబర్ పేరు.. అగస్త్య చౌహాన్. ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్​కు చెందిన వ్యక్తి. ఇతనికి PRO RIDER 1000 అనే య్యూటూబ్​ ఛానల్​ ఉంది. అందులో బైక్​ ఇంకా రేసింగ్​కు సంబంధించిన వీడియోలను అగస్త్య చేసేవాడు. PRO RIDER 1000 ఛానల్​కు లక్షల్లో సబ్​స్క్రైబర్​లు.. కోట్లలో వీక్షకులు ఉన్నారు. అగస్త్య.. తన వీడియోల్లో అతివేగంతో వాహనాలు నడపవద్దని హెచ్చరిక సైతం చేసేవాడు.

బైక్ ప్రమాదంలో అగస్త్య చౌహాన్ మృతి

ప్రమాదం జరిగిన సమయంలో అగస్త్య.. దాదాపు గంటకు 300 కి.మీ వేగంతో బైక్​పై ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. అగస్త్య తన గత వీడియోల్లోను గంటకు 300 కి.మీ వేగంతో ఎప్పుడూ బైక్​ నడపలేదని తెలిపాడు. కానీ తొలిసారిగా అదే వేగంతో బైక్​ నడిపి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో అగస్త్య హెల్మెట్​ ధరించినప్పటికి.. అది పగిలిపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా నుంచి దిల్లీ వెళ్లే యమున ఎక్స్​ప్రెస్​పై ఈ ఘటన జరిగింది.

నుజ్జునుజ్జు అయిన హెల్మెట్

కారుతో యువకుడ్ని ఢీకొట్టి.. 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన బాలుడు..
ఓ బాలుడు కారు నడుపుతూ ఓ యువకుడ్ని ఢీకొట్టాడు. అనంతరం అతడ్ని 20 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. నేరుగా వెళ్లి ఓ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న బాలుడి పక్కన.. ఓ బాలిక కూడా కూర్చుంది. వీరిద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం తర్బహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ్ టాకీస్ చౌక్ నుంచి పాత బస్టాండ్ వైపు ఈ కారు వస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు గట్టిగా అరిచి.. వాహనాన్ని ఆపమంటూ బాలుడ్ని హెచ్చరించారు. అయినా అతడు వినకుండా అలాగే కారును ముందుకు పోనిచ్చి.. నేరుగా ఓ స్తంభాన్ని ఢీకొట్టాడు. అనంతరం అప్రమత్తమైన స్థానికులు.. బాలుడిని కారులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : May 3, 2023, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details