తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాహనం బోల్తా- ముగ్గురు జవాన్లు సజీవ దహనం

రాజస్థాన్​లో ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడడం వల్ల మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ముగ్గురు సైనికులు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Mar 25, 2021, 11:35 AM IST

SENA_JIPSY_ACCIDENT
వాహనం బోల్తా..ముగ్గురు జవాన్ల మృతి

రాజస్థాన్​లోని గంగానగర్​ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రజీయసర్ ప్రాంతం గుండా వెళుతున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడడం వల్ల దానికి మంటలు అంటున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు సైనికులకు మంటలు అంటుకొని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

వాహనం బోల్తా..ముగ్గురు జవాన్ల మృతి

సైనికులు వాహనం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించారని కానీ సాధ్యపడలేదని విక్రమ్​ తివారీ అనే పోలీసు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని అన్నారు .

ఇదీ చదవండి:అంబానీ ఇంటి వద్ద 'బాంబుల కారు' కేసులో మరో ట్విస్ట్!

ABOUT THE AUTHOR

...view details