దేశంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమానికి మద్దతుగా.. తమవంతు సహాయాన్ని అందించేందుకు ఓ సామాజిక సంస్థ ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో టీకా తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని గ్రహించిన 'సిద్ధార్థ కంపాషన్ ట్రస్ట్'(ఎస్.సీ.టీ) టీకా తీసుకున్నవారికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆ సంస్థ ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా గ్రామీణులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
ఈ విషయంలపై స్థానికులతో 'ఈటీవీ భారత్' మాట్లాడగా.. వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. లాభాపేక్ష లేకుండా చేస్తున్న సంస్థ సేవల పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
"ఎస్.సీ.టీ బృందం మా గ్రామానికి వచ్చి ప్రజల్లో వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించింది. కొవిన్ యాప్ గురించి తెలియని వారికి వారే రిజిస్ట్రేషన్ చేశారు. ఆపై వారానికి 50 మంది చొప్పున నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. వారు చూపిన ఈ చొరవ క్షేత్ర స్థాయిలో మంచి ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు"