తెలంగాణ

telangana

By

Published : May 3, 2021, 8:11 PM IST

Updated : May 3, 2021, 8:26 PM IST

ETV Bharat / bharat

కేంద్ర విద్యాసంస్థల పరీక్షలు వాయిదా!

మే నెలలో జరగనున్న కేంద్ర విద్యాసంస్థల ఆఫ్​లైన్​ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. అయితే ఆన్​లైన్​ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.

offline examsPostpone all offline exams
పరీక్షలు వాయిదా

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్​ఐటీ, విశ్వవిద్యాలయాల్లో మే నెలలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా విద్యాసంస్థలకు ఆ శాఖ కార్యదర్శి అమిత్​ ఖెహార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఆన్​లైన్​ పరీక్షలు షెడ్యూల్​ ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేసింది కేంద్రం.

"ఆన్​లైన్​ తరహా పరీక్షలు కొనసాగవచ్చు. ఈ నిర్ణయంపై జూన్​ మొదటి వారంలో సమీక్షిస్తాం. సంస్థలో ఎవరికైనా సాయం అవసరమైతే.. తక్షణమే సాధ్యమైనంత సహాయం అందించాలి. అర్హులైన వారు టీకా వేయించుకోవాలి. కరోనా బారిన పడకుండ తగిన జాగ్రత్తలు పాటించాలి" అని అమిత్​ ఖెహార్​ సూచించారు.

ఇదీ చూడండి:వధువు డబుల్​ ధమాకా.. పెళ్లి రోజే ఎన్నికల్లో విజయం

Last Updated : May 3, 2021, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details