తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2021, 7:07 PM IST

ETV Bharat / bharat

బంగాల్ మంత్రికి సీబీఐ సమన్లు

పోంజీ కుంభకోణం కేసులో బంగాల్​ మంత్రి పార్థ ఛటర్జీకి సమన్లు జారీ చేసింది సీబీఐ. మార్చి 15న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Ponzi scam case: CBI summons West Bengal Minister Partha Chatterjee
పోంజీ కుంభకోణం: బంగాల్ మంత్రికి సీబీఐ సమన్లు

పశ్చిమ్​బంగా విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం సమన్లు జారీచేసింది. పోంజీ కుంభకోణం కేసు దర్యాప్తు కోసం ఈనెల 15న తమ ముందు హాజరు కావాలని సూచించింది.

బంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఛటర్జీ సన్నిహితుడు.

ఇదీ కేసు..

పెట్టుబడులపై భారీ లాభాలు ఆశచూపి రూ.3 వేల కోట్లకు పైగా సేకరించింది ఐ-కోర్ గ్రూప్ సంస్థ. అయితే... వాటిని దారి మళ్లించి మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై 2014 నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి:ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్​

ABOUT THE AUTHOR

...view details