తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ నెల 29 నుంచి పార్లమెంట్​ సమావేశాలు

పార్లమెంట్​ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్​ 8 వరకు.. రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

By

Published : Jan 14, 2021, 6:56 PM IST

Updated : Jan 14, 2021, 10:19 PM IST

COMMENCEMENT AND DURATION OF THE FIFTH SESSION OF THE SEVENTEENTH LOK SABHA
ఈ నెల 29 నుంచి లోక్‌సభ సమావేశాలు- 1న బడ్జెట్​

పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభంకానున్నాయి. అదే రోజు ఉదయం 11గంటలకు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ సమావేశాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంట్​ సమావేశాలు ఈసారి కూడా రెండు దఫాలుగా సాగనున్నాయి. మొదటి విడతలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15వరకు సభలు నడవనున్నాయి. అనంతరం మార్చి 8 నుంచి ఏప్రిల్​ 8 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:-'రిపబ్లిక్​ డే' రిహార్సల్స్​- ఎన్​ఎస్​జీ అదరహో!

Last Updated : Jan 14, 2021, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details