తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2022, 3:27 PM IST

ETV Bharat / bharat

శశికళతో భేటీ.. పన్నీర్​సెల్వం సోదరుడిపై వేటు

AIADMK: ఏఐఏడీఎంకే అగ్రనేత పన్నీర్​సెల్వం సోదరుడు రాజాను పార్టీ నుంచి తొలగించారు. శశికళతో పార్టీ వ్యవహారాలపై ఆయన చర్చలు జరపడం మూలంగానే ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

AIADMK
Sasikala

AIADMK: అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్​సెల్వం సోదరుడు రాజా.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ సంబంధిత వ్యవహారాలపై వీకే శశికళతో చర్చలు జరిపినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన సహా నియమాలకు విరుద్ధంగా పనిచేయడం వంటి కారణాలతో రాజాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు ఏఐఏడీఎంకే సమన్వయకర్త పన్నీర్​సెల్వం, కోఆర్డినేటర్​ కే పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో మరో ముగ్గరిని సస్పెండ్​ చేశారు.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి అయిన శశకళను కొన్నేళ్ల క్రితమే అన్నాడీఎంకే నుంచి తప్పించారు. మార్చి 4న ఆమె రాష్ట్రంలోని దక్షిణప్రాంత పర్యటన చేపట్టారు. అందులో భాగంగా తన మద్దతుదారులను కలుసుకుంటున్నారు. తిరుచెండూర్​లో శశికళను కలిసిన రాజా.. ఆమెతో పార్టీ వ్యవహారాలపై చర్చించారు.

ఇదీ చూడండి:ఓపీఎస్, ఈపీఎస్​కు మళ్లీ కీలక పదవులు-​ శశికళకు ఇక కష్టాలే!

ABOUT THE AUTHOR

...view details