తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2021, 6:19 AM IST

Updated : Feb 28, 2021, 7:13 PM IST

ETV Bharat / bharat

ఒకేసారి 3,229 పెళ్లిళ్లతో ప్రపంచ రికార్డు

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని ఇండోర్ స్టేడియం సామూహిక వివాహాలకు వేదికై ప్రపంచ రికార్డు సృష్టించింది. 3,229 జంటలు ఓకే రోజు వివాహం చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​.. పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం.

Mass wedding of 3,229 couples sets world record in Chhattisgarh
ఒకేసారి 3,229 పెళ్లిల్లతో ప్రపంచ రికార్డు

ఒకే రోజు 3,229 పెళ్లిళ్లు చేసి ఛత్తీస్​గఢ్​ ప్రపంచ రికార్డు సృష్టించింది. హిందూ, ముస్లిం, క్రిష్టియన్​ అనే తేడా లేకుండా అన్నీ జంటలు ఏకకాలంలో ఒక్కటయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి రాయ్​పుర్​లోని ఇండోర్​ స్టేడియం వేదిక అయింది. ఈ పెళ్లిల్లకు పెద్దగా ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ వేడుకకు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర శిశు సంక్షేమాభివృద్ధి శాఖ నిర్వహించింది.

ఒకేసారి 3,229 పెళ్లిళ్లతో ప్రపంచ రికార్డు
నవ దంపతులకు బహుమతులు అందజేస్తున్న ఛత్తీస్​గఢ్​ సీఎం
ఛత్తీస్​గఢ్​లో సామూహిక వివాహాలు
నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న భూపేశ్​ బఘేల్​
వధూవరులకు నగదు బహుమతి అందిస్తున్న ఛత్తీస్​గఢ్ సీఎం

'ముఖ్యమంత్రి కన్య వివాహ యోజనా' కింద జరిగిన ఈ వేడుక 'గోల్డెన్​ బుక్ ఆఫ్​ రికార్డ్​'ల్లో స్థానం సంపాదించినట్లు ఆ సంస్థ​ ప్రతినిధి సోనాల్​ రాజేశ్​ శర్మ ప్రకటించారు. దీనిలో మొత్తం 22 జిల్లాల నుంచి వర్చువల్​ విధానం ద్వారా వధూవరులు హజరయ్యారు.

పెళ్లిళ్లకు హాజరైన ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​

"మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారాలి. సామూహిక వివాహాలకు ఆదరణ పెరగాలి. ప్రజలు కూడా ఇటువంటి వాటికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇదో శుభ పరిణామం. నాకు ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెళ్లైన కొత్త జంటలకు రూ.15 వేలు ఇచ్చేవారు. మా ప్రభుత్వం రూ. 25వేలు ఇస్తోంది."

- భూపేశ్​ బఘేల్​, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి​

ఇదీ చూడండి: 'రామ మందిరానికి రూ.2,100 కోట్ల విరాళాలు'

Last Updated : Feb 28, 2021, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details