తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెంపుడు శునకాన్ని కరిచిందని చంపేశాడు!

తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని కరిచిన.. వీధి కుక్కను దారుణంగా కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించి అతనిపై కేసు నమోదైనట్లు తెలిసి.. పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఆనేకల్​ పట్టణంలో జరిగింది.

By

Published : Jun 24, 2021, 4:14 PM IST

Man kills street dog
వీధి కుక్కను చంపిన వ్యక్తి

కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తాను పెంచుకున్న శునకాన్ని కరిచిందని.. వీధి కుక్కను కొట్టి చంపేశాడు చెందిన ఓ వ్యక్తి. ఈ బెంగుళూరు అర్బన్​ జిల్లా ఆనేకల్​ పట్టణంలోని హెబ్బగుడి రోడ్డులో జరిగిన ఘటనకు సంబంధించి అతనిపై కేసు నమోదైంది. దీంతో అతడు పరారయ్యాడు.

ఇదీ జరిగింది..

హెబ్బగుడి సమీపంలోని రోడ్డుపై ఓ వ్యక్తి పెంచుకుంటున్న శునకం, మరో వీధి కుక్క కలిశాయి. అయితే హఠాత్తుగా పెంపుడు శునకంపై వీధి కుక్క దాడి చేసింది. అతని ఇంటి వరకు వెంబడించి.. కరించింది. అప్పటికే మద్యం తాగి ఉన్న పెంపుడు కుక్క యజమాని.. ఈ సంఘటనను చూశాడు. కోపంతో ఊగిపోయి ఇనుప రాడ్డుతో వీధి కుక్కను కొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది. దానిని ఈడ్చుకెళ్లి సమీపంలోని రోడ్డు పక్కన పడేశాడు.

చనిపోయిన వీధి కుక్క
కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ సంఘటన చూసిన యలహంక జంతు సంరక్షణ కేంద్రంలో పని చేస్తున్న అనిరుధ్​.. ఆ యజమానిని ప్రశ్నించాడు. అందుకు అతను తాగిన మైకంలో దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనిరుధ్​. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న నిందితుడు.. పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు చనిపోయిన కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి.. జంతువుల పట్ల తన ఉదారతను చాటుకున్నాడు అనిరుధ్​.

ఇదీ చూడండి:రోడ్​ రోలర్‌ను కొట్టేసి.. కిలోల లెక్కన అమ్మేసి..

ABOUT THE AUTHOR

...view details