తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Maharashtra Drugs Case : నదిలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్.. అర్ధరాత్రి ఆపరేషన్.. సీజ్ చేసిన పోలీసులు

Maharashtra Drugs Case Latest News : మహారాష్ట్రలోని గిర్నా నదిలో భారీ మొత్తంలో డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సోమవారం అర్థరాత్రి స్పెషన్​ ఆపరేషన్​ చేపట్టి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్​ విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు తెలిపారు.

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 2:04 PM IST

Updated : Oct 24, 2023, 7:51 PM IST

Maharashtra Drugs Case Latest News
మహారాష్ట్ర డ్రగ్స్ కేసు

Maharashtra Drugs Case Latest News : మహారాష్ట్రలోని నాసిక్​లో ఉన్న గిర్నా నది అడుగు భాగంలో భారీ మొత్తంలో డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి వీటిని గుర్తించారు. అధికారుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు జరిపారు పోలీసులు. ముంబయి, డియోలా పోలీసుల అధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆపరేషన్​ జరిగింది.

ఇటీవలె నాసిక్‌ జిల్లాలోని శిందే గ్రామంలో ఓ ఔషధ తయారీ కేంద్రంపై దాడులు చేపట్టారు పోలీసులు. అనంతరం రూ.300 కోట్ల విలువ చేసే డ్రగ్స్​ను సీజ్​ చేశారు. రెండు నెలల పాటు ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన ముంబయి పోలీసులు.. డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు. ఆ సమయంలో ఈ కేసుతో సంబంధమున్న లలిత్​ పాటిల్​ అనే వ్యక్తి పరారీలో ఉండగా.. అతడి కోసం తీవ్రంగా గాలించి కొద్ది రోజుల క్రితమే చెన్నైలో అరెస్ట్​ చేశారు పోలీసులు. లలిత్​ పాటిల్​తో పాటు అతడి కారు డ్రైవర్​ సచిన్ వాగ్​ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారీ మొత్తంలో డ్రగ్​ను గిర్నా నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు సచిన్ వాగ్​. నాసిక్‌లోని దేవ్లా తాలూకాలోని లోహ్నర్ థెగోడా వద్ద నదిలో ఈ డ్రగ్స్​ విసిరేశారనే సమాచారాన్ని ఇచ్చాడు. దీంతో ప్రత్యేక ఆపరేషన్​ను చేపట్టిన డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. "సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో.. నది అడుగు భాగంలో కొన్ని డ్రగ్స్​ బ్యాగులను స్వాధీనం చేసుకున్నాం. ఉదయం వరకు సోదాలు కొనసాగించాం. ఈ డ్రగ్స్​ విలువ దాదాపు కోట్లలో ఉంటుంది." అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతామని వారు వెల్లడించారు.

Tollywood Drugs Case Update : ఇటీవల.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ దందా మరోసారి సంచలనం సృష్టించింది. తాజాగా మాదాపూర్ పట్టుబడిన డ్రగ్స్‌ కేసులో సినీ ఫైనాన్షియర్‌ కె.వెంకటరత్నారెడ్డి, బాలాజీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించగా.. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది పేర్లు, నైజీరియన్లతో డ్రగ్స్‌ లింకులు వెలుగులోకి వచ్చాయి. మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ముగ్గురు నైజీరియన్లు, మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు దేవరకొండ సురేశ్‌రావు, సినీ డైరెక్టర్‌ అనుగు సుశాంత్‌రెడ్డి, చిత్రపరిశ్రమతో సంబంధాలున్న రాంచంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

బస్సులు, లారీలు, బొలెరో డ్రగ్స్​..
Police Arrested 3 Drugs Suppliers in Hyderabad : కొద్ది రోజుల క్రితం హైదరాబాద్​లో ప్రైవేట్​ బస్సులు, లారీలు, బొలెరో వాహనాల్లో సరుకుల మాటున మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tamil Nadu Road Accident : బస్సును ఢీకొట్టిన టాటా సుమో.. ఏడుగురు భక్తులు దుర్మరణం.. దర్శనానికి వెళ్లి వస్తుండగా..

Chhattisgarh Assembly Election 2023 Prediction : ఛత్తీస్​గఢ్​లో హోరాహోరీ.. బఘేల్​పై కాంగ్రెస్ నమ్మకం..​ మోదీపైనే బీజేపీ ఆశలు.. గెలుపెవరిది?

Last Updated : Oct 24, 2023, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details