తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2021, 2:03 PM IST

ETV Bharat / bharat

రూ.18 లక్షల విలువైన బంగారం పట్టివేత

మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.18.75లక్షల విలువైన పసిడిని పట్టుకున్నారు అధికారులు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

Gold worth Rs 18.75 lakh hidden in Mouth and Slipper: 2 arrested in Mangaluru Airport
విమానాశ్రయంలో రూ.18.75లక్షల బంగారం పట్టివేత

కర్ణాటక మంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 405 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.18.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

229 గ్రాముల బంగారం ముక్క
179 గ్రాముల పసిడి ముద్దలు
పసిడిని దాచిన షూ
బంగారాన్ని దాచిన కవర్లు

నిందితులను కేరళ కాసర్​గోడ్​కు చెందిన ​మొయిద్దీన్​ కుంజి(48), మిశ్రీ నసీముల్లా గని(44)లుగా గుర్తించారు. వేర్వురు విమానాల్లో దుబాయ్​ నుంచి వచ్చిన వీరిపై అనుమానంతో కస్టమ్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఒకరు పసిడిని నోటిలో దాచి.. మరొకరు షూ పెట్టి తరలిస్తున్నట్లు తేలింది.

ఇదీ చూడండి:అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details