తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2020, 5:02 PM IST

ETV Bharat / bharat

బ్రెగ్జిట్ వాణిజ్య​ ఒప్పందంతో భారత్​కు లాభమెంత?

ఐరోపా సమాఖ్య(ఈయూ)-బ్రిటన్​ల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు పూర్తయింది. అయితే ఈ బ్రెగ్జిట్​ ఒప్పందం భారత్​కు శుభపరిణామం అని అంటున్నారు ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త ఆకాశ్​ జిందాల్​. 2021 జనవరి 1 నుంచి బ్రిటన్​ పూర్తి రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం పొందనున్న వేళ ఇరుదేశాల మధ్య ఉండే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

EU UK post brexit deal and its impact
'బ్రిగ్జిట్​ ఒప్పందతో భారత్​కు లాభమే'

బ్రెగ్జిట్​లో భాగంగా.. అనుకున్న గడువు కన్నా కొద్ది రోజుల ముందే.. ఐరోపా సమాఖ్యతో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది బ్రిటన్. ఇందుకోసం ఇరు దేశాలు చాలా కష్టపడ్డాయి. మరి ఇంతటి చరిత్రాత్మక ఒప్పందం వల్ల భారత్​కు ఏదైనా లాభం ఉంటుందా? బ్రిటన్​, ఈయూలతో భారత్​ సంబంధాలు మారుతాయా? వంటి ప్రశ్నలపై.. ప్రముఖ ఆర్థికవేత్త ఆకాశ్​ జిందాల్​ 'ఈటీవీ భారత్'​ ముఖాముఖిలో స్పందించారు.

'బ్రెగ్జిట్​ ఒప్పందతో భారత్​కు లాభమే'

ఐరోపా సమాఖ్య, బ్రిటన్​ మధ్య జరిగిన బ్రెగ్జిట్​ ఒప్పందంతో భారత్​కు మేలు జరుగుతుందా?

బ్రెగ్జిట్​ ఒప్పందం కోసం బ్రిటన్​ సుమారు 18 నెలలు తర్జభర్జన పడింది. అయితే అదే సమయంలో భారత్​కు ఆ దేశం దగ్గరైంది. అయితే ఈ ఒప్పందంతో భారత్​కు మేలు జరగనుంది. ప్రతీ దేశం అంతర్జాతీయంగా వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అది దేశాభివృద్ధికి అవసరం. గ్లోబలైజేషన్​తో ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతోన్న భారత్​ లాంటి దేశాలు పెట్టుబడులకు చాలా అనుకూలమైనవి. రాబోయే రోజుల్లో పరస్పర ఆర్థిక సంబంధాల విషయంలో సహకారం, స్థిరమైన వృద్ధిని బ్రిటన్​ నుంచి మేము ఆశిస్తున్నాము. ఇందుకు తగ్గట్టుగా బ్రిటన్​ తీసుకున్న కొన్ని నిర్ణయాలను మేము చూశాం. భారతీయులకు పౌరసత్వం విషయంలో నిబంధనలు సడలిస్తున్నారు. ఈ కారణంగా భారత్​ నుంచి చాలా మంది బ్రిటన్​కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బ్రిటన్​ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇందులో భారత్​ 5వ స్థానంలో ఉంది. జపాన్, చైనాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉన్నాయి. మూడేళ్లలో జపాన్​ జీడీపీకి స్థిరమైన వృద్ధి కొరవడింది. ఈ నేపథ్యంలో బ్రిటన్​కు బలమైన దేశం కావాలి. అది భారత్​యే. బ్రిటన్​తో బలమైన సంబంధాలకు భారత్​ చిరునామాగా నిలువనుంది.

బ్రెగ్జిట్​ ఒప్పందంతో భారత్​కు లాభించే విషయం ఏంటీ?

ఈ వాణిజ్య ఒప్పందంతో సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. బ్రిటన్​లో మ్యూచువల్​, పెన్షన్​ ఫండ్స్​ ఎక్కువ. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ గల చాలా దేశాల్లో మార్కెట్లల్లో పెట్టుబడి పెడితే వచ్చే లాభం కంటే అభివృద్ధి చెందుతోన్న భారత్​ లాంటి దేశాల్లో పెట్టుబడి పెట్టి రెట్టింపు లాభాలు ఆర్జించడానికి ఆవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని ఆశించవచ్చు.

భారత్​లో తయారీ రంగం చాలా పెద్దది. దీంతో బ్రిటన్​కు ఎగుమతి అయ్యే వస్తువుల సంఖ్య కూడా పెరుగుతుంది. విదేశీ పోర్ట్​ఫోలియో పెట్టుబుడులు(ఎఫ్​పీఐ), మ్యూచు​వల్​ ఫండ్స్​, పెన్షన్​ డబ్బులతో భారత్​లోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. ఇలా రెండు విధాలుగా మన దేశం లాభపడుతుంది.

'భారత్​కు అదే లాభం..'

బ్రెగ్జిట్​ ఒప్పందంపై భారత మాజీ విదేశీ రాయబారి ఆశోక్​ సజ్జనార్​ ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ పరిస్థితుల్లోనైనా.. ఈ ఒప్పందం భారత్​కు లాభమేనని అభిప్రాయపడ్డారు.

"ఈ ఒప్పందాన్ని బ్రిటన్ ప్రధాని స్వాగతించారు. దీని ద్వారా స్వతంత్ర వాణిజ్య దేశంగా లభించే అద్భుతమైన అవకాశాలను ఇప్పుడు పూర్తిగా ఉపయోగించుకోగలమని అన్నారు. ఇకపై బ్రిటన్​ విషయంలో ఐరోపా కోర్ట్​ ఆఫ్​ జస్టిస్‌ జోక్యం ఉండదు. మరోవైపు ఈ ఒప్పందం కారణంగా ఎటువంటి వీసా అవసరం లేకుండా ప్రజలు రావచ్చు. కానీ పాస్​పోర్ట్​ తనిఖీలు ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా వ్యాపారం పెద్ద సంఖ్యలో వృద్ధి చెందే ఆవకాశం ఉంది. ఇక విద్యా రంగానికి వస్తే.. బ్రిటన్​ ఎరాస్మస్​ కార్యక్రమంలో భాగం కాదు. ఫలితంగా.. ఐరోపాలోని ప్రతిభావంతులైన వారు బ్రిటన్​కు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయు. బ్రిటన్​ నుంచి ఐరోపాకు వెళ్లే వారికీ ఇదే ఇబ్బంది తప్పుదు. ఈ వ్యవహారంపై చర్చలు కొనసాగుతాయి.. కానీ ప్రస్తుతానికి ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

ఏది ఏమైనా భారత్​కు ఈ ఒప్పందం సానుకూల అంశమే. అసలు ఒప్పందమే లేకపోవడం కన్నా.. ఇలాంటి ఒప్పందం ఉండటం మేలు. భారత్​లోని ఎన్నో కంపెనీలు.. ఐరోపాలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా బ్రిటన్​వైపే చూసేవి."

--- అశోక్​ సజ్జనార్​, భారత మాజీ విదేశీ రాయబారి.

ఇదీ చూడండి: బ్రిటన్-ఈయూ మధ్య ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం​

ABOUT THE AUTHOR

...view details