తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: వారికి ఫ్రీగా స్మార్ట్​​ ఫోన్లు

లాక్​డౌన్​ కారణంగా ఆన్​లైన్​ చదువులకు దూరమై.. రోడ్డు పక్కన మామిడి పళ్లు అమ్ముకుంటున్న ముగ్గురు పిల్లలపై ఈటీవీ భారత్​ కథనానికి అనూహ్య స్పందన లభించింది. ఝార్ఖండ్​లోని ఓ గ్రామానికి చెందిన ఈ చిన్నారులకు సాయం చేయడానికి ఘాటిశీల ఎమ్మెల్యే రాందాస్​ సోరెన్​ ముందుకొచ్చారు. వారికి ఆండ్రాయిడ్​ ఫోన్లు అందజేశారు.

By

Published : Jun 11, 2021, 5:26 PM IST

etv bharat impact
ఈటీవీ భారత్ కథనానికి స్పందన

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

కరోనాతో విధించిన లాక్​డౌన్​ వల్ల చదువులకు దూరమైన ఝార్ఖండ్​ తూర్పు సింహభూమ్​ జిల్లాకు చెందిన ముగ్గురు పిల్లలకు ఎమ్మెల్యే రాందాస్​ సోరెన్​.. ఆండ్రాయిడ్​ ఫోన్లు అందజేశారు. ముసాబని బ్లాక్​లోని రోమ్​ గ్రామానికి చెందిన ఆ పిల్లలు.. ఆన్​లైన్​ చదువుల కోసం ఫోన్లు కొనుగోలు చేయలనే ఉద్దేశంతో ముసాబని-జడుగోడ మెయిన్​ రోడ్డు పక్కన మామిడిపళ్లు విక్రయిస్తున్నారు. వీరిపై ఈటీవీ భారత్​ కథనానికి ఘాటిశీల నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్​ అనూహ్యంగా స్పందించారు​.

ఫోన్లు కొనేందుకు పళ్లు అమ్మకం

సోరెన్​ తన పార్టీ కార్యకర్తలను ఆ గ్రామానికి పంపించి.. ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా పాఠశాల మూసివేశారని, పిల్లలందరూ ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. అయితే కూలీ పని చేసుకుని బతికే తమకు ఆండ్రాయిడ్​ ఫోన్లు కొనే స్తోమత లేదని చెప్పుకొచ్చారు. పిల్లలకు చదువుకోవాలనే కోరిక బలంగా ఉందని.. ఫోన్లు కొనేందుకు కావాల్సిన డబ్బు సంపాందించడానికి రోడ్డుపక్కన మామిడి పళ్లు అమ్ముతున్నారని తెలిపారు.

మామిడి పళ్లు అమ్ముతున్న చిన్నారులు
ఫోన్లు అందుకున్న ఆనందంలో చిన్నారులు

ఝార్ఖండ్​ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు.. ఈ వివరాలన్నీ రాందాస్ ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన రాందాస్​.. వారికి ఆండ్రాయిడ్​ ఫోన్లు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు పిల్లలను తన నివాసానికి పిలిపించి.. ఫోన్లు అందజేశారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము ఆన్‌లైన్‌ తరగతలకు హాజరవుతామని చెప్పారు. చిన్నారులకు ఫోన్లు అందజేసినందుకు వారి తల్లిదండ్రులు.. ఎమ్మెల్యే రాందాస్ సోరెన్, తన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:మోదీ కోసం చెక్కతో 'హనుమాన్ చాలీసా'!

ABOUT THE AUTHOR

...view details