తెలంగాణ

telangana

Delhi Earthquake Today : హరియాణాలో భూకంపం.. దిల్లీలోనూ ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు!

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 4:23 PM IST

Updated : Oct 15, 2023, 5:13 PM IST

Delhi Earthquake Today : దిల్లీ ప్రజలను భూప్రకంపనలు ఆందోళనకు గురిచేశాయి. రాజధాని ప్రాంతం-NCRలోని ఫరీదాబాద్​లో రిక్టర్​ స్కేల్​పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Delhi Earthquake Today
Delhi Earthquake Today

Delhi Earthquake Today :దేశ రాజధాని ప్రజలను భూకంపం కలవరపాటుకు గురిచేసింది. దిల్లీ సమీపంలోని హరియాణా ఫరీదాబాద్​లో ఆదివారం సాయంత్రం 4.08 గంటలకు భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది.

భయంతో ప్రజల పరుగులు!
Earthquake Haryana Right Now :ఫరీదాబాద్‌కు తూర్పున 9 కిలోమీటర్లు, దిల్లీకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం పేర్కొంది.భూప్రకంపనలతో ఫరీదాబాద్​లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీ కూడా అనేక ఇళ్లల్లోని ఫర్నీచర్​ తీవ్రంగా కదిలినట్లు సమాచారం. భయంతో జనం తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన వీడియోలను పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

భూకంపం.. బయటకొచ్చిన కేంద్ర మంత్రి!
Delhi Earthquake 2023 :కొద్దిరోజుల క్రితం.. దిల్లీలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతో భూకంపం సంభవించింది. నేపాల్‌లో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం అధికారులు గుర్తించారు. దిల్లీతో సహా పొరుగున ఉన్న పంజాబ్‌, ఉత్తర్​ప్రదేశ్‌, ఉత్తరాఖండ్​, హరియాణా రాష్ట్రాల్లో కూడా 40 సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించారు. భూకంప సమయంలో సెంట్రల్​ దిల్లీలోని నిర్మాణ్​ భవన్​లో ఉన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్​ మాండవీయ.. అధికారులతో కలిసి బయటకు వచ్చేశారు. ఆ వీడియో కోసం ఇక్కడక్లిక్​ చేయండి.

గాఢనిద్రలో ఉండగా మూడుసార్లు భూప్రకంపనలు..
Earthquake In Jaipur :కొన్ని నెలల క్రితం.. రాజస్థాన్‌ రాజధాని జైపుర్​లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 4 గంటల సమయంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తరువాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలో 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడం వల్ల ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యామని ప్రజలు తెలిపారు.

మైనస్​ 22 డిగ్రీల చలిలో అల్లాడుతున్న భూకంప బాధితులు.. 6 రోజులుగా కార్లలోనే నిద్ర

ఓవైపు తుఫాన్​.. మరోవైపు భూప్రకంపనలు.. గుజరాత్ ప్రజల్లో ఆందోళన

Last Updated : Oct 15, 2023, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details