తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా పాలనలో పాన్​షాప్​లా మారిన సీబీఐ'

మహారాష్ట్రకు చెందిన మంత్రి అస్లామ్​ షేక్​ సీబీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపా పాలనలో సీబీఐ ఓ పాన్​షాప్​లా తయారైందని ఆరోపించారు.

By

Published : Nov 20, 2020, 2:39 PM IST

CBI
'భాజపా పాలనలో సీబీఐ 'పాన్​షాప్'​లా తయారైంది'

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను విపక్షాలు స్వాగతిస్తున్నాయి. అయితే ఈ అంశంపై మహారాష్ట్రకు చెందిన మంత్రి అస్లాం షేక్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

"భాజపా పాలనలో సీబీఐ ఓ పాన్​ షాప్​లా తయారైంది. ఎక్కడికైనా వెళ్లి, ఎవరి మీద పడితే వారి మీద కేసులు పెడుతుంది. ముఖ్యంగా భాజపా పాలనలో లేని రాష్ట్రాల్లోనే సీబీఐ ఇలా వ్యవహరిస్తోంది. మంత్రులు, ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకుంటుంది. అందుకే మేం సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం."

- అస్లాం షేక్, మహారాష్ట్ర మంత్రి

పంజాబ్​, బంగాల్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, ఝార్ఖండ్​, ఛత్తీస్​గడ్​ వండి రాష్ట్రాలు సీబీఐ తమ రాష్ట్రంలోకి రాకుండా తీర్మానాలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం గురువారం ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details