తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కట్టడిలో ధారావి భేష్​: ప్రపంచ బ్యాంక్​

ముంబయిలోని ధారావి మురికివాడ కరోనా కట్టడికి చేసిన కృషిని ప్రపంచ బ్యాంక్​ కొనియాడింది. ఈ వాడలోని ప్రజలు అవలంబించిన విధానాలను, తీసుకున్న చర్యలను ప్రశంసించింది.

By

Published : Oct 7, 2020, 5:49 PM IST

World Bank praises efforts to arrest COVID-19 spread in Mumbai's Dharavi
కరోనాను జయించడంలో ధారావి కృషిని కొనియాడిన ప్రపంచబ్యాంక్​

ప్రపంచంలోని అతి పెద్ద మురికివాడల్లో ఒకటైన 'ధారావి' కొవిడ్​ కట్టడిలో తీసుకున్న చర్యలను ప్రపంచబ్యాంక్​ శ్లాఘించింది. వైరస్​ నియంత్రణకు అక్కడి ప్రజలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు అనుసరణీయమని కీర్తించింది. తన ద్వైవార్షిక నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. మే నుంచి జులై వరకు నమోదైన కేసుల సంఖ్యను పోల్చితే గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది.

ముంబయిలోని ధారావిలో తొలి కరోనా కేసు ఏప్రిల్​లో నమోదైంది. కేవలం 2.5 చ.కి.మీ కలిగిన ఈ ప్రాంతంలో ఆరు లక్షల యాభై వేల మంది నివాసం ఉంటారు. భౌతిక దూరం పాటించడం అసాధ్యమైన ఈ ప్రాంతం కరోనా కేసులకు కేంద్రబిందువుగా ఉండేది.

ఈ తరుణంలో స్థానిక అధికారులు పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ చర్యలను గుర్తించిన ప్రపంచ బ్యాంక్... అధికారులు, ఎన్​జీఓలు చేసిన కృషిపై హర్షం వ్యక్తం చేసింది.

ధారావిలో వైరస్​ నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) గతంలోనే ప్రశంసించింది.

అధికారిక గణాంకాల ప్రకారం మంగళవారం నాటికి ధారావిలో మొత్తం కేసుల సంఖ్య 3,280. అందులో కోలుకున్నవారి సంఖ్య 2,795.

ఇదీ చూడండి:దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details