తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో మరో మహిళ హత్య.!

ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలకు రక్షణ లేదని విపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో గోరఖ్​పుర్​ జిల్లాలో మరో మహిళ శవమై తేలింది. మృతదేహాన్ని హంతకులు పెట్టెలో పెట్టారని పోలీసులు తెలిపారు.

By

Published : Oct 1, 2020, 11:10 PM IST

Woman's body found stuffed in box in UP's Gorakhpur
ఉత్తర్​ప్రదేశ్​లో మరో మహిళ హత్య.!

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​ జిల్లాలోని మణిరామ్​లో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహాం కలకలం రేపింది. ఆమెను వేరే ప్రాంతంలో చంపి పెట్టెలో పెట్టి ఘోల్హావా కట్టపై పడేసి ఉంటారని పోలీసులు తెలిపారు.

"యువతి వయస్సు 30 ఏళ్లు ఉండొచ్చు. పెట్టెలో ఆమెకు సంబంధించిన బట్టలు ఉన్నాయి. దానితో పాటు మంగళసూత్రం కూడా ఉంది. ఒంటిపై గాయాలు ఏమి లేవు. మాకు ఉన్న ప్రాథమిక అంచనా ప్రకారం ఇది ఇంటి గొడవల్లో గొంతు నులిమి హతమార్చి ఉండవచ్చు. మృతదేహాన్ని శవపంచనామా కోసం పంపాం."

---అరవింద్​ పాండే, ​ ఎస్పీ

ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:అత్యాచారం కాదు, హత్యే... హాథ్రస్​ కేసులో ట్విస్ట్

ABOUT THE AUTHOR

...view details