తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2019, 9:32 AM IST

Updated : Sep 26, 2019, 8:16 PM IST

ETV Bharat / bharat

'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్​ రండి!'

జమ్ముకశ్మీర్​లో హింసాత్మక వాతావరణం నెలకొందని పేర్కొన్న రాహుల్​గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టారు ఆ రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. కశ్మీర్​ పరిస్థితుల్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి ఆహ్వానించారు. అందుకు రాహుల్​ కోసం ప్రత్యేకంగా విమానం పంపుతామని ఎద్దేవా చేశారు.

'రాహుల్​ కశ్మీర్​ రండి.. విమానం పంపిస్తాం!'

'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్​ రండి!'

కశ్మీర్​లో పరిస్థితులు పరిశీలించేందుకు రాహుల్​ గాంధీకి ప్రత్యేక విమానం పంపిస్తామని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. కశ్మీర్ లోయలో హింసాత్మక వాతావరణం నెలకొందని రాహుల్​ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక్కడి పరిస్థితులను చూశాక మాట్లాడాలని సూచించారు. పార్లమెంట్​లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ కాంగ్రెస్​ నాయకుడి ప్రవర్తనను.. రాహుల్​గాంధీ అవమానకరంగా భావించాలన్నారు గవర్నర్​.

"కశ్మీర్​కు రావాలని రాహుల్​గాంధీని ఆహ్వానించా. ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు మీకు విమానం పంపుతాం. అప్పుడు మాట్లాడండి. మీరు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి, అలా మాట్లాడకూడదు. అధికరణ 370 రద్దులో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఇది అందరి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం. కశ్మీర్​పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందులో సఫలం కాలేకపోతున్నారు."

- సత్యపాల్​ మాలిక్​, జమ్ముకశ్మీర్​ గవర్నర్​

జమ్ముకశ్మీర్​లో హింసాత్మక వాతావరణం నెలకొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయని గత శనివారం రాహుల్​ గాంధీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు స్పందించారు రాష్ట్ర గవర్నర్ మాలిక్​​.

విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే హెచ్చరించినట్లు తెలిపారు మాలిక్​​. కశ్మీర్​లో ఏ ఒక్కరికీ బుల్లెట్​​ గాయం కూడా కాలేదన్నారు. చిన్న చిన్న ఘర్షణల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి తప్పా ఎక్కడా హింసాత్మక వాతావరణం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసయాత్ర

Last Updated : Sep 26, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details