తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ!

మానవ వ్యర్థాలను సేకరించి వాటిని ఎరువులుగా తయారు చేస్తోంది బెంగళూరులోని 'ఫీకల్​​ స్లడ్జ్​ ట్రీట్మెంట్ ప్లాంట్​(ఎఫ్ఎస్​టీపీ)'. దేవనహళ్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాంట్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది.

By

Published : Apr 4, 2019, 6:01 AM IST

మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ!

మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ!
బెంగళూరులోని దేవనహళ్లి పురపాలక సంఘం వినూత్న ఆలోచనతో 'ఫీకల్​​ స్లడ్జ్​ ట్రీట్మెంట్ ప్లాంట్​​(ఎఫ్​ఎస్​టీపీ)'ను నెలకొల్పింది. మానవ వ్యర్థాలను సేకరించి వాటి ద్వారా రైతులకు ఉపయోగపడే ఎరువులను తయారుచేస్తోంది.

సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను సేకరించి ఎఫ్​ఎస్​టీపీకి తరలిస్తున్నారు మున్సిపల్​ సిబ్బంది. వాటిని శుద్ధి చేసేందుకు 4 టన్నుల వ్యర్థాలకు 10 టన్నులకు పైగా మట్టి, గడ్డిని కలుపుతారు. ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా యంత్రాల సాయంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తారు. మిశ్రమాన్ని ప్రత్యేకంగా నిలువ ఉంచుతారు.

ఎఫ్​ఎస్​టీపీ కేంద్రంలో రోజుకు 2వేల లీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తారు. తద్వారా తయారైన ఎరువును కేజీకి రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు. 65 లక్షల పెట్టుబడితో 2015లో ఎఫ్​ఎస్​టీపీని స్థాపించారు. బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపార సంస్థ సహకారం అందించింది.

మానవ వ్యర్థాలతో ఎరువులను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పడం బెంగళూరులో ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రభుత్వం దీని ఆవశ్యకతను గుర్తించి పరిశ్రమకు అవార్డులనూ ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details