తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ చేరుకున్న పాంపియో- నేడు మోదీతో భేటీ

అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో మంగళవారం రాత్రి భారత్​కు చేరుకున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్​తో బుధవారం చర్చలు జరపనున్నారు.

By

Published : Jun 26, 2019, 5:01 AM IST

Updated : Jun 26, 2019, 8:20 AM IST

భారత్​కు చేరుకున్న పాంపియో- నేడు మోదీతో భేటీ

భారత్​కు చేరుకున్న పాంపియో

భారత్​ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో మంగళవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. లోక్​సభ ఎన్నికల అనంతరం ఉన్నతస్థాయి చర్చల కోసం ఓ విదేశీ మంత్రి భారత్​కు రావడం ఇదే తొలిసారి.

జీ20 నేపథ్యంలో...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాంపియో బుధవారం భేటీకానున్నారు. ఈ వారాంతంలో జపాన్​ వేదికగా జరగనున్న జీ20 సదస్సులో భాగంగా మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సమావేశమవనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న మోదీ- పాంపియో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

జైశంకర్​తో చర్చలు

మోదీతో పాటు నూతన విదేశాంగ మంత్రి జైశంకర్​తోనూ పాంపియో సమావేశమవనున్నారు. ఉగ్రవాదం, హెచ్​-1బీ వీసాలు, ఇరాన్​ ముడిచమురుపై అగ్రరాజ్యం ఆంక్షలతో భారత్​లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు.

ఈ పర్యటనలో భారత్​- అమెరికా దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను కలవనున్నారు పాంపియో.

ఇదీ చూడండి:- 'గాంధీలు కాని ప్రధానులపై కాంగ్రెస్ చిన్నచూపు'

Last Updated : Jun 26, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details