తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు

2015-16 మధ్యకాలంలో ఖైదీల అసహజ మరణాలు 100.87 శాతం పెరిగినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో ఓ నివేదికలో వెల్లడించింది. మొత్తం 231 మంది అసహజంగా మరణించగా... ఇందులో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 102.

By

Published : Apr 16, 2019, 4:47 PM IST

Updated : Apr 16, 2019, 7:26 PM IST

రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు

రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు: ఎన్​సీఆర్​బీ

కారాగారాల్లో ఖైదీల అసహజ మరణాలు 2015తో పోల్చితే 2016లో రెట్టింపయ్యాయి. 2015లో 115 మంది మరణించగా, 2016లో ఈ సంఖ్య 231కి చేరింది. అంటే 100.87 శాతం మరణాలు ఎక్కువయ్యాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో 'ప్రిజన్​ స్టేటస్టిక్స్​ ఇండియా 2016' పేరుతో నివేదిక విడుదల చేసింది.

మొదటి స్థానంలో యూపీ

ఎన్​సీఆర్​బీ నివేదిక ప్రకారం 231 మందిలో 102 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. 14 మంది ఇతర ఖైదీల చేతిలో మరణించారు. 9 మంది ప్రమాదవశాత్తు చనిపోయారు. ఒకరు బయటి వ్యక్తుల దాడిలో మృతి చెందారు. 103 మంది ఖైదీల మృతి కారణాలపై ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. 3 ఏళ్ల తర్వాత ఎన్​సీఆర్​బీ ఈ వివరాలు ప్రకటించింది.

అసహజ మరణాల్లో ఉత్తరప్రదేశ్ (56) మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర (47), పంజాబ్​ (37), తమిళనాడు (11) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్​లో అత్యధికంగా 20 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు, హరియాణాలో తొమ్మిదేసి మంది, పంజాబ్​, రాజస్థాన్​లో 8 మంది బలవన్మరణం చెందారు.

ఏళ్ల పాటు జైల్లో...

దేశవ్యాప్తంగా 11, 834 మంది విచారణ ఖైదీలు 3-4 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 3,927 మంది ఐదేళ్ల కంటే ఎక్కువే కారాగారాల్లో మగ్గారు.

దేశవ్యాప్తంగా ఉన్న కారాగారాల సంఖ్య 4,33,003. ఇందులో ఉత్తరప్రదేశ్​లోనే 26,785 జైళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 26,785 మంది నేరస్థులు బందీలుగా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న నేరస్థుల్లో 19.7 శాతం మంది ఉత్తరప్రదేశ్​లోనే జైలు జీవితం గడిపారు.

ఇదీ చూడండి: 'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'

Last Updated : Apr 16, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details