తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం'

యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్. ఆసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు.

By

Published : Jun 21, 2020, 2:12 PM IST

Union Ministers Prakash Javadekar perform yoga on InternationalYogaDay
యోగాసనాలు వేసిన కేంద్ర మంత్రి జావడేకర్​

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్​ జావడేకర్.. తన సతీమణితో కలిసి దిల్లీలో యోగాసనాలు వేశారు.​ యోగా వల్ల శరీరం, మనస్సు ధృడంగా ఉంటాయని అన్నారు.

యోగాసనాలు వేసిన కేంద్ర మంత్రి జావడేకర్​

"ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే ఆలోచనను ప్రధాని ప్రపంచం ముందుకు తెచ్చినప్పుడు దీనిని 160కి దేశాలకు పైగా అంగీకరించాయి. ప్రస్తుతం యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు తమ కుటుంబాలతో కలిసి ఇంట్లోనే యోగా చేస్తున్నారు. యోగా శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి "

-ప్రకాశ్​ జావడేకర్,​ కేంద్ర మంత్రి.

ఇదీ చూడండి:దేశంలో 24 గంటల్లో 15,413 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details