తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరీక్ష' ఫలితాలకు ముందు కేబినెట్​ భేటీ!

2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. మే 23న ఫలితాలే తరువాయి. చివరి విడత ఓటింగ్​ అనంతరం వెల్లడైన ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు భాజపాకు సంతృప్తినిచ్చేవే. ఈ ఆనంద సమయంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది.

By

Published : May 20, 2019, 12:19 PM IST

Updated : May 20, 2019, 1:14 PM IST

'పరీక్ష' ఫలితాలకు ముందు కేబినెట్​ భేటీ!

మంగళవారం రోజు కేబినెట్​ భేటీ!

కేంద్ర మంత్రి మండలి మంగళవారం దిల్లీలో సమావేశం అయ్యే అవకాశముంది. లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ఆదివారం( మే 19)తో ముగిసింది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈలోగా మంత్రులతో సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు ప్రధాని. సార్వత్రిక ఎన్నికల ఫలితం అనంతర పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు.

ఎన్డీఏ నేతలకు విందు...

ఎన్డీఏ పార్టీల నేతలకు మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. భవిష్యత్​ కార్యాచరణపై వీరంతా చర్చించే అవకాశముంది.

ఇదీ చూడండి:

'దిల్లీకి దూరంగా మాయ- లఖ్​నవూకే పరిమితం'

Last Updated : May 20, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details