తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యలో ఉద్ధవ్.. మందిరంపై మళ్లీ చర్చ!

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యలోని రామ్ ​లల్లా గుడిని సందర్శించారు. పార్టీ నూతన ఎంపీలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం అయోధ్యను సందర్శిస్తానని ఠాక్రే ముందే చెప్పారని.. అందుకే వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రామ మందిర నిర్మాణ కోసం భాజపాపై ఒత్తిడి పెంచేందుకే ఈ సందర్శనలన్న వార్తలు వినిపిస్తున్నాయి.

By

Published : Jun 16, 2019, 12:03 PM IST

అయోధ్యలో ఠాక్రే- మందిరంపై మరోసారి చర్చ..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో శివసేన మరోసారి అయోధ్య రామ మందిరాన్ని తెరపైకి తెస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే అయోధ్యను నేడు సందర్శించారు. అక్కడి రామ్​ లల్లా గుడిలో 18 మంది పార్టీ నూతన ఎంపీలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్యలో ఠాక్రే- మందిరంపై మరోసారి చర్చ..!

కుమారుడు ఆదిత్య, పార్టీ ఎంపీలతో కలసి 'జై శ్రీరామ్' నినాదాల మధ్య ఠాక్రే అయోధ్య సందర్శన నడిచింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఠాక్రే అయోధ్యను సందర్శించారని.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని పార్టీ ప్రకటించింది.

ఈ ఏడాదిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపాను రామ మందిర నిర్మాణం విషయంలో ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నంలో భాగమే ఈ సందర్శన అనే వార్తలు వినిపిస్తున్నాయి.

వివాదాస్పదమైన రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details