తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్​'నాటకం': 'బలపరీక్ష'పై పోటాపోటీ చర్చలు...

కన్నడనాట ముఖ్యమంత్రి కుమారస్వామి 'బలపరీక్ష'పై కాంగ్రెస్​, జేడీఎస్​, భాజపాలు వేర్వేరుగా చర్చలు జరిపాయి. ఇవాళ బెంగళూరు యశ్వంత​పురలో కాంగ్రెస్ ​శాసనసభాపక్షం భేటీ అయింది. మరోవైపు రమదా హోటల్​లో భాజపా శాసనసభాపక్ష సమావేశం​ నిర్వహించింది. ఇదిలాఉండగా సోమవారమే విశ్వాస పరీక్ష జరిగేలా చూడాలని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

By

Published : Jul 21, 2019, 10:28 PM IST

'కన్నడ పరీక్ష'పై భాజపా,కాంగ్రెస్​ పోటాపోటీ చర్చలు

రెండు రోజుల విరామం అనంతరం రేపు కర్ణాటక శాసనసభ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో బలపరీక్ష సోమవారమైనా జరుగుతుందా లేదా అనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై కాంగ్రెస్​, జేడీఎస్​, భాజపాలు పోటాపోటీగా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. బెంగళూరు యశ్వంతపురలో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్​ జరిగింది. కర్ణాటక కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యుడు​ కేసీ వేణుగోపాల్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. అసెంబ్లీలో ఏ విధంగా ముందుకు సాగాలనే విషయంపై నేతలతో చర్చ జరిపారు. విప్ అంశం​పై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత వచ్చే వరకు.. బలపరీక్ష జరపకుండా చూడాలని యోచిస్తోంది.

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

రేపు మరోసారి భాజపా ఎల్పీ భేటీ..

బెంగళూరులోని రమదా హోటల్​​లో భాజపా శాసనసభా పక్ష సమావేశం జరిగింది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాషాయ నేతలు చర్చించారు. ఎలాగైనా.. సోమవారం బలపరీక్ష జరిగేలా చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీకి వచ్చే ముందు సోమవారం ఉదయం మరోసారి భేటీ కానున్నారు.

జేడీఎస్​ శాసనసభా పక్ష సమావేశం

ప్రస్తుతం ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంలో పడినందున జేడీఎస్​ కూడా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. బెంగళూరులోని ప్రెస్టీజ్​ గోల్ఫ్​షైర్​ రిసార్టులో జరిగిన ఈ భేటీలో మంతనాలు జరిపారు.

సుప్రీంకు స్వతంత్రులు..

మరోవైపు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్​​, శంకర్​లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాగైనా సోమవారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష జరిగేలా చూడాలని.. సోమవారం ఉదయం పిటిషన్​ దాఖలు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details