తెలంగాణ

telangana

దేశంలో 28 వేలు దాటిన కరోనా మరణాలు

By

Published : Jul 21, 2020, 9:15 AM IST

భారత్​లో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 37,148 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు 28 వేలు దాటాయి. ఒక్కరోజే 587 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES IN INDIA
దేశంలో మరో 37,148 కేసులు, 587 మరణాలు

దేశంలో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు . రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 37,148 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 587 మంది కరోనా బారిన పడి మరణించారు. భారత్​లో మొత్తం కొవిడ్​ మరణాలు 28 వేలు దాటాయి.

కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,18,695కు చేరింది. 12 వేల మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,75,678కి చేరాయి. 2,551 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,23,747గా ఉంది. మొత్తంగా 3,663 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 49,439 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. 2,167 మంది కరోనా కారణంగా చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details