తెలంగాణ

telangana

By

Published : May 31, 2020, 7:14 AM IST

ETV Bharat / bharat

ఉదయం 11 గంటలకు ప్రధాని 'మన్​కీ బాత్'

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో లాక్​డౌన్ 5.0పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మన్​కీ బాత్​కు ప్రాధాన్యత ఏర్పడింది.

modi mann ki bat
ప్రధాని మన్​కీ బాత్.. లాక్​డౌన్ 5.0పై స్పష్టతకు అవకాశం

ఈ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లాక్​డౌన్ 5.0 పై కేంద్రం ప్రకటన వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. వైరస్​ ప్రభావం నుంచి దేశం కోలుకునేందుకు తీసుకున్న చర్యలపై ప్రధాని ప్రజలకు వివరించే అవకాశం ఉంది.

మోదీ 2.0 ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన దృష్ట్యా గతేడాది సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇటీవలి నెలకొన్న పరిణామాలపై చర్చిస్తారని సమాచారం.

ఇదీ చూడండి:'సమస్య పరిష్కారానికి చైనాతో దౌత్య స్థాయి చర్చలు'

ABOUT THE AUTHOR

...view details