తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు- ముగ్గురు నక్సల్స్ హతం

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో నక్సలైట్లు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సల్స్ హతమయ్యారు.

By

Published : Sep 14, 2019, 11:13 PM IST

Updated : Sep 30, 2019, 3:33 PM IST

ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు- ముగ్గురు నక్సల్స్ మృతి

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో పోలీసులు, భద్రతా బలగాల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. సాయంత్రం 6 గంటల సమయంలో చింతల్​నర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ కాల్పులు జరిగాయి.

తాడ్​మెట్ల-ముక్రం నల్లా మధ్య రహదారిని నక్సల్స్ ధ్వంసం చేశారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఇదీ చూడండి: చంద్రయాన్​ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం

Last Updated : Sep 30, 2019, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details