తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిద్ధార్థతో చట్టప్రకారమే నడుచుకున్నాం: ఐటీ శాఖ

కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థకు సంబంధించి చట్ట ప్రకారమే నడుచుకున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టంచేశారు. అదృశ్యం తర్వాత దొరికిన లేఖలో ఐటీ అధికారుల వేధింపులపై సిద్ధార్థ ప్రస్తావించారు.

By

Published : Jul 30, 2019, 6:08 PM IST

సిద్ధార్థ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ అదృశ్యంపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. అదృశ్యం తర్వాత దొరికిన లేఖలో ఐటీ అధికారుల వేధింపులపై సిద్ధార్థ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారమే దర్యాప్తు చేశామని అధికార వర్గాలు తెలిపాయి.

"సిద్ధార్థ విషయంలో చట్ట ప్రకారమే దర్యాప్తు చేశాం. ఐటీ చట్టం నిబంధనల ప్రకారమే శాఖ చర్యలు తీసుకుంటుంది. మైండ్​ట్రీ షేర్ల నుంచి రూ.3,200 కోట్లు పొందారు. అందుకు చెల్లించాల్సిన పన్ను రూ.300 కోట్లకు బదులు రూ.46 కోట్లు చెల్లించారు. ఇంకో విషయమేమిటంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయిన సిద్ధార్థ లేఖలో ఉన్న సంతకం గత రికార్డులతో సరిపోలట్లేదు."

- ఐటీ అధికారి

షేర్లు కుదేలు

సిద్ధార్థ అదృశ్యంతో కాఫీ డే ఎంటర్​ప్రైజెస్​ లిమిటెడ్​ షేర్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​లో 19.99 శాతం, నిఫ్టీలో 20 శాతం మేర నష్టం వాటిల్లి 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్​ విలువ రూ.812.68 కోట్లకు పడిపోయింది.

సోమవారం బెంగళూరు నుంచి సకలేశ్​పుర్ బయలుదేరిన వీజీ సిద్ధార్థ కాసేపటి తర్వాత మంగళూరు వైపు వెళ్లాలని వాహన డ్రైవర్​కు సూచించారు. అనంతరం నేత్రానది వంతెనపై దిగిన సిద్ధార్థ.. నడుచుకుంటూ వెళ్లి అదృశ్యమయ్యారు. ఇంతవరకూ ఆయన ఆచూకీ దొరకలేదు.

ఇదీ చూడండి: కాఫీడే సిద్ధార్థ అదృశ్యం- ఆర్థిక ఇబ్బందులే కారణం!

ABOUT THE AUTHOR

...view details