తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రి కాంగ్రెస్​కు​.... తనయుడు భాజపాకు....!

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్​ అంబానీ కుమారుడు అనంత్​ అంబానీ ప్రధానమంత్రి మోదీ ర్యాలీలో కనిపించి ఆశ్చర్యపరిచారు.​ ముఖేశ్​ ఇటీవలే... దక్షిణ ముంబయి కాంగ్రెస్​ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వేళ తాజా పరిణామం ఆసక్తి రేకెత్తిస్తోంది.

By

Published : Apr 27, 2019, 6:01 AM IST

Updated : Apr 27, 2019, 6:09 AM IST

భాజపా మోదీ సభలో అనంత్​ అంబానీ

మోదీ సభలో అనంత్​ అంబానీ

ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అయితే.. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్​ అంబానీ తనయుడు అనంత్​ ఇక్కడ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల దక్షిణ ముంబయి లోక్​సభ బరిలో కాంగ్రెస్​ అభ్యర్థి మిలింద్​ దేవరాకు... తండ్రి మద్దతుగా నిలిచారు. తాజాగా కుమారుడు భాజపా సభలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.

దేశానికి మద్దతుగా నిలవడానికి... ప్రధాని ప్రసంగం వినడానికి వచ్చినట్లు పేర్కొన్నారు అనంత్​ అంబానీ.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ రాజకీయ ప్రచారాల్లో రఫేల్​ ఒప్పందాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖేశ్​ అంబానీ సోదరుడు అనిల్​ అంబానీకి ప్రధాని అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తుంటారు రాహుల్​. ఈ తరుణంలో తండ్రి కాంగ్రెస్​కు మద్దతు... భాజపా సభలో తనయుడు అనంత్​ అంబానీ ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది.

మిలింద్​ దేవరాకు ముఖేశ్​ అంబానీ మద్దతు తెలిపినట్లున్న ఓ వీడియోను కొన్ని రోజుల కిందట ట్విట్టర్​లో షేర్​ చేశారు దేవరా.

''మిలింద్​ అచ్చమైన దక్షిణ ముంబయి వాసి. నియోజకవర్గంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులపై మిలింద్​కు లోతైన అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను.''

- దేవరా ట్వీట్​ చేసిన వీడియోలో ముఖేశ్​ అంబానీ

దక్షిణ ముంబయి లోక్​సభ నియోజకవర్గంలో ఏప్రిల్​ 29న ఎన్నిక జరగనుంది.

Last Updated : Apr 27, 2019, 6:09 AM IST

ABOUT THE AUTHOR

...view details