తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2019, 12:29 PM IST

Updated : Apr 1, 2019, 1:11 PM IST

ETV Bharat / bharat

స్లిప్పుల లెక్కింపుపై విపక్ష నేతలకు సుప్రీం నోటీసు

వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపు అంశంలో 21 మంది విపక్ష పార్టీల నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్​పై ఈ నెల 8లోగా స్పందించాలని ఆదేశించింది.

స్లిప్పుల లెక్కింపుపై విపక్ష నేతలకు సుప్రీం నోటీసు

స్లిప్పుల లెక్కింపుపై విపక్ష నేతలకు సుప్రీం నోటీసు
వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపుపై 21 మంది విపక్ష నేతలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం దాఖలు చేసిన ప్రమాణ పత్రం​పై వారం రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది.

త్వరలో జరగనున్న లోక్​సభ ఎన్నికలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50శాతం ఓటింగ్​ యంత్రాల వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి.

ఈ పిటిషన్​పై స్పందించిన ఈసీ... ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఒక్కో వీవీప్యాట్​ ఓటింగ్​ యంత్రంలోని రసీదులను లెక్కించే ప్రస్తుత పద్ధతే సరైనదని అఫిడవిట్​లో పేర్కొంది. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను విపక్ష పార్టీల నేతలు చూపలేకపోయారని కోర్టుకు వివరించింది.

ఏప్రిల్​ 8లోగా ఈ విషయంపై స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని ధర్మాసనం విపక్షాలను ఆదేశించింది.

ఇదీ చూడండి:పరమత సహనం వెల్లివిరిసే బెళగావి ఆలయం!

Last Updated : Apr 1, 2019, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details