తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మసీదుల్లో మహిళల ప్రవేశంపై వ్యాజ్యం కొట్టివేత

ప్రార్థనల కోసం ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతినివ్వాలన్న పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంపై గతంలో కేరళ హైకోర్టు తీర్పుకు అత్యున్నత న్యాయస్థానం మద్దతు పలికింది.

By

Published : Jul 8, 2019, 8:36 PM IST

మసీదుల్లో మహిళల ప్రవేశంపై వ్యాజ్యం కొట్టివేత

మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​, జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ అనిరుద్ధ బోస్​ల తో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తంచేసింది.

'ప్రచారాల కోసమే...'

మసీదుల్లో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించమని కేరళకు చెందిన అఖిల భారత హిందూ మహాసభ తొలుత ఆ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి అంశాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడింది. అనంతరం పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తాజాగా సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు నిర్ణయానికి మద్దతు పలికింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోమని తెలిపింది.

శబరిమల తీర్పు వల్లే...

శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించినట్లు గతంలో కోర్టు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details