తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పారిశుద్ధ్య కార్మికుల మృతిపై సుప్రీంకోర్టు కన్నెర్ర

ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మ్యాన్‌హోల్‌లో శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృత్యువాత పడుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

By

Published : Sep 18, 2019, 9:31 PM IST

Updated : Oct 1, 2019, 3:08 AM IST

పారిశుధ్య కార్మికులు మృత్యువాతపై కన్నెరచేసిన సుప్రీంకోర్టు

మురుగు తొలగింపు, మ్యాన్‌హోల్‌లో శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృత్యువాత పడుతుండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలా జరగడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేసింది. మ్యాన్‌హోల్స్‌ శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృతి చెందుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

ఈ మేరకు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. మ్యాన్‌హోల్స్‌లో దిగే పారిశుధ్య కార్మికుల రక్షణార్థం మాస్కులు, ఆక్సిజన్‌ సిలిండర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.

ప్రపంచంలోని ఏ దేశమూ ప్రజలను గ్యాస్‌ ఛాంబర్లలోకి పంపించడం లేదని వ్యాఖ్యానించింది. ప్రతి నెలా 4-5మంది మరణిస్తున్నారని పేర్కొంది. రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ అధికార వర్గాలు మాత్రం సమాన సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎలాంటి రక్షణ సదుపాయాలు లేకుండా ఇలా చనిపోతుండటాన్ని అమానవీయమని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి : ప్రత్యేక హోదా కోసం అమెరికా ఎంపీల గళం

Last Updated : Oct 1, 2019, 3:08 AM IST

ABOUT THE AUTHOR

...view details