తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి సమన్లు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి సహా 15 మంది ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేసింది. అక్టోబర్​ 4న వీరంతా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. 2007లో కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో...రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్​ కోసం ఉద్దేశించిన భూమిని అక్రమంగా డీనోటిఫికేషన్​ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

By

Published : Sep 6, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 2:50 PM IST

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి సమన్లు

రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన భూమిని అక్రమంగా డీనోటిఫికేషన్​ చేసిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామికి ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో మరో 15 మంది ప్రజాప్రతినిధులకూ సమన్లు జారీ చేసింది న్యాయస్థానం. వీరంతా అక్టోబర్​ 4న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.

హలాగే వాడెరహల్లి గ్రామంలో బెంగళూరు డెవలప్​మెంట్​ అథారిటీకి చెందిన 3 ఎకరాల 34 గుంటల భూమిలో బనశంకరి ఐదో దశ లేఅవుట్​ అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూమిని అక్రమంగా డీనోటిఫికేషన్​ చేసినట్లు అభియోగం నమోదైంది.

2007లో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి ముందే కుమారస్వామి బెంగళూరు డెవలప్​మెంట్​ అథారిటీ (బీడీఏ) భూమిని అక్రమంగా డీనోటిఫై చేశారని పిటిషనర్​ మహాదేవస్వామి ఆరోపించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్​ మేరకు లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం కుమారస్వామికి సమన్లు జారీచేసింది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో అంతర్గత యుద్ధానికి పాక్​ కుట్ర!

Last Updated : Sep 29, 2019, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details