తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2019, 6:05 PM IST

ETV Bharat / bharat

వైరల్​: ఇడ్లీ తయారీకి టాయిలెట్​ వాటర్

రోడ్ల పక్కన బండి వద్ద ఇడ్లీ తింటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ముంబయి బోరివెలీలో ఇడ్లీల తయారీకి మరుగుదొడ్డి​ నీటిని వినియోగిస్తున్న దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

వైరల్​: ఇడ్లీ తయారీకి టాయిలెట్​ వాటర్

వైరల్​: ఇడ్లీ తయారీకి టాయిలెట్​ వాటర్

ఉదయం వేళల్లో ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే, బస్​ స్టేషన్ల వద్ద రోడ్ల పక్కన వాహనాలపై అల్పాహారం తింటూ చాలా మంది కనిపిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో వాటి తయారీకి వినియోగించే పదార్థాలు, నీటి శుభ్రతపై పట్టించుకనే పరిస్థితులు లేవు. ఇదే అదనుగా కొందరు ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నారు.

ముంబయి బోరివెలీలోని పశ్చిమ రైల్వే స్టేషన్​ వద్ద ఇడ్లీల తయారీకి టాయిలెట్​ నీటిని వినియోగిస్తున్న దృశ్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి.

ఇడ్లీ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వినియోగదారుడు దుకాణదారుడ్ని అనుసరిస్తూ వెళ్లి ఈ వీడియో తీశారు. మరుగుదొడ్డిలోని నీటిని వినియోగించటం ఏంటని అతను ప్రశ్నించగా వాటిని పారబోశాడు. ఇప్పుడా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి:రయ్​ రయ్​: బైక్​లపై కాశీ టు లండన్

ABOUT THE AUTHOR

...view details