తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2019, 10:59 AM IST

ETV Bharat / bharat

'ఉగ్రవాదులకు సూచన'పై జమ్ము గవర్న​ర్​ వివరణ

ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడం మాని కశ్మీరీల సంపద కొల్లగొడుతున్నవారికి వ్యతిరేకంగా పోరాడాలని జమ్ము గవర్నర్​ మాలిక్​ సూచనలిచ్చారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకు వివరణనిచ్చారు గవర్నర్.

సత్యపాల్ మాలిక్

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఈ కారణంగా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు మాలిక్​. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తాను అలాంటి వ్యాఖ్యలు చేసుండకూడదని... అవి కేవలం ఆగ్రహంతో అన్న మాటలేనని తెలిపారు.

అమాయక ప్రజలను చంపడం మాని... ఎన్నో ఏళ్లుగా కశ్మీరీల సంపదను కొల్లగొడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాడాలని సత్యపాల్​ మాలిక్ ఆదివారం ఉగ్రవాదులకు సూచించారు.

"తుపాకులు పట్టుకుంటున్న యువకులు వారి సొంత ప్రజలనే చంపుతున్నారు. పోలీసులను హతమారుస్తున్నారు. బలగాలను ఎందుకు చంపడం? కశ్మీరీల సొమ్మును కొల్లగొడుతున్న వారిని చంపండి. ఇప్పటివరకు అలాంటి వారిని కాల్చిచంపారా?"

--- సత్యపాల్​ మాలిక్​, జమ్ము గవర్నర్​.

సర్వత్రా విమర్శలు...

గవర్నర్ వ్యాఖ్యలకు ఘాటు సమాధానమిచ్చారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా. దిల్లీలో తన ప్రతిష్ఠను గవర్నర్ తనిఖీ చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

ఒమర్ అబ్దుల్లా ట్వీట్

రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్న మాలిక్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఒమర్. గవర్నర్ ట్వీట్​ను దాచాలని.. అధికారులు, నేతలు హత్యకు గురైతే అది కేవలం మాలిక్ ఆదేశాల వల్లేనని విమర్శించారు.

ఆటవిక రాజ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారా అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మీర్ గవర్నర్​ను ప్రశ్నించారు. తుపాకుల సంస్కృతి కశ్మీర్​ను ఎప్పుడూ రక్షించలేదని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: నేడే బలపరీక్ష-సర్వత్రా ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details