తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తప్పుడు హామీలిచ్చిన వారికి ఓటుతో బుద్ధిచెప్పండి'

సొంత నియోజకవర్గమైన రాయ్​బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ. ఓటు హక్కు వినియోగించుకుని తప్పుడు వాగ్దానాలు చేసిన భాజపాకు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

By

Published : May 3, 2019, 12:18 AM IST

Updated : May 3, 2019, 6:44 AM IST

'ఓటుతో తప్పుడు హామీలిచ్చిన వారికి బుద్ధిచెప్పండి'

ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయ్​బరేలీ లోక్​సభ నుంచే సోనియా మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలతో ఎనలేని బంధం ఉందన్నారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు.

ప్రధాని మోదీపై సోనియా విమర్శలు చేశారు. 2014లో ఇచ్చిన వాగ్దానాలను మోదీ నెరవేర్చలేదని, ఇది ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల ఖాతాల్లోకి రూ.15 లక్షలు, 2 కోట్ల ఉద్యోగాల హామీల మాటేమైందని ప్రశ్నించారు. తప్పుడు హామీలిచ్చిన భాజపాకు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు సోనియా.

రాయ్​బరేలీలో సోనియా

"కొద్ది రోజుల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు మీ చేతిలో ఉన్న పెద్ద ఆయుధం. ఎవరైతే మీకు తప్పుడు హామీలిచ్చారో... మీ ఓటుతో వారికి బుద్ధిచెప్పండి." -- సోనియా గాంధీ, యూపీఏ ఛైర్​పర్సన్​

ఇదీ చూడండి: జైలుకెళ్లొచ్చిన ఎంపీని సాగనంపిన ప్రజలు

Last Updated : May 3, 2019, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details